మన దేశంలో కొన్ని కొన్ని సంప్రదాయాలు విచిత్రంగా ఉంటాయి. మొక్కుల పేర్లతో సాహసాలు చేయవలసి వస్తుంది. ప్రాణాలు పణంగా పెట్టి సైతం మొక్కులను చెల్లించాల్సి వస్తోంది. అలాంటి సమయాల్లో ప్రాణాలు పోవడం లేదంటే గాయాలతో ఆసుపత్రిలో చేరడం లాంటివి చోటుచేసుకుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కుప్పం సరిహద్దు తమిళనాడు కృష్ణగిరి జిల్లా వేమనపల్లి లో దారుణం చోటుచేసుకుంది.

ఆది మాస వ్రతాచరణ లో భాగంగా మొక్కులను చేయించుకునేందుకు క్రేన్ కు వేలాడుతూ భక్తుడు కిందపడిపోయాడు. మొత్తం క్రేన్ కు ముగ్గురు వ్యక్తులు వెళుతుండగా... అందులో ఒక భక్తుడు ఒక్కసారిగా కిందపడిపోయాడు. అతడి నడుముకు బిగించి ఉన్న తాడు తెగిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భక్తుడు కింద పడటంతో అక్కడ ఉన్న వాళ్లంతా ఆందోళనకు గురయ్యారు. గాయాలపాలైన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వేపన పల్లిలో ప్రతి ఏడాది ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ప్రమాదం అయినప్పటికీ భక్తులు భయపడకుండా సాహసం చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: