తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఈసారి ఎన్నిక‌ల్లో కుప్పం నుంచి పోటీచేస్తే డిపాజిట్లు రావ‌డం కూడా క‌ష్ట‌మేన‌ని ఉప ముఖ్య‌మంత్రి నారాయ‌ణ‌స్వామి అన్నారు. చిత్తూరులో మీడియాతో మాట్లాడిన నారాయ‌ణ‌స్వామి తెలుగుదేశం పార్టీ, పార్టీ అధినేత చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. 14 సంవ‌త్స‌రాలు ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్న బాబు జ‌న్మ‌భూమి క‌మిటీలే ఏర్పాటుచేసి వాటిని క‌లెక్ట‌ర్ల‌ద్వారా ప‌రిపాలించి సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిదుల‌కు అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. క‌లెక్ట‌ర్ల‌ను, ఎస్పీల‌ను ఆయ‌న ఎలా వాడుకున్నారో ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌న్నారు. ఎన్నిసార్లు పోటీచేసినా ఎవ‌రితో ఒక‌రితో క‌లిసి పోటీచేయాలేకానీ సొంతంగా పోటీచేసి ఏనాడూ అధికారంలోకి రాలేద‌న్నారు. సొంతంగా అధికారంలోకి వైసీపీపై ఇప్పుడు ఇత‌ర పార్టీల‌ను క‌లుపుకొని విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రికాద‌ని, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌జారంజ‌క‌మైన ప‌రిపాల‌న కొన‌సాగిస్తున్నార‌ని నారాయ‌ణ‌స్వామి అన్నారు. జ‌గ‌న్ ప‌రిపాల‌న చూసి ఓర్వ‌లేకే చంద్ర‌బాబునాయుడు త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

tag