నేడు ప్ర‌జా సంగ్రామ యాత్ర ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పాత‌బ‌స్తీ నుండి వెళ్లిన హిందువులు తిరిగిరావాల‌ని వ్యాఖ్యానించారు. పాత‌బ‌స్తీలో హిందువుల‌పై ఎంఐఎం గుండాల అరాచకాలు పెరిగిపోయాయంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బండి సంజ‌య్ కేసీఆర్ ను టార్గెట్ చేసి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రూ.ల‌క్ష పంట రుణ మాఫీ అని కేసీఆర్ రైతుల‌ను..నిరుధ్యోగ భృతి అని నిరుద్యోగుల‌ను కేసీఆర్ మోసం చేశాడంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

రాష్ట్రంలో ఏ ఒక్క వ‌ర్గానికి కూడా మేలు జ‌ర‌గ‌లేద‌ని బండి సంజ‌య్ అన్నారు. కేసీఆర్ కుటుంబ పాల‌న‌..అవినీతి అరాచ‌క పాల‌నతో ప్ర‌జ‌లు విసిగిపోయారని అన్నారు. యాత్ర‌లో కేంద్ర సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించి వారి ఆశీర్వాదాన్ని కోరుతామని చెప్పారు. తెలంగాణ ప్ర‌జ‌ల్లో ఉత్సాహాన్ని నింపేందుకే ఈ యాత్ర‌ను చేస్తున్నామ‌ని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: