తెలంగాణాలో బిజెపి బలపడే ప్రయత్నాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. నేడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర మొదలుపెట్టారు. నేడు బిజెపి చార్మినార్ వద్ద సభను నిర్వహించింది. దీనితో చార్మినార్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బీజేపీ సభను చిత్రీకరిస్తోన్న డ్రోన్ కేమెరాను పోలీసులు  తీసుకువెళ్ళారు. డ్రోన్ కెమెరాకు అనుమతి లేదని పోలీసులు ఈ సందర్భంగా స్పష్టం చేసారు. ఈ క్రమంలో పోలీసులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

రెండుసార్లు పోలీసులకు బండి సంజయ్ సద్ది చెప్పే ప్రయత్నం చేసినా సరే సమస్య పరిష్కారం కాలేదు. పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.  బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభానికి బిజెపి కీలక నేతలు అందరూ హాజరు అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ హాజరు అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: