కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ ,కమ్యూనికేషన్ శాఖ మంత్రి  అశ్విని వైష్ణవ్ కి ఎంపీ రఘు రామ కృష్ణం రాజు లేఖ రాశారు, ఏపీలో ఫైబర్ నెట్ సంస్థ అక్రమంగా, అనధికారికంగా ఎం.ఎస్ ఓ లైసెన్సెస్ ఉపయోగిస్తుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఏపీ ఫైబర్ నెట్ చర్యలు బ్రాడ్ కాస్టింగ్ బిల్లు 1997 కు చట్టవిరుద్ధం, బ్రాడ్కాస్టింగ్ బిల్లు 1997 ప్రకారం ప్రభుత్వ సంస్థలు, ఎం.ఎస్.ఓ లైసెన్సెస్ పొందలేదని పేర్కొన్నారు. అనధికారికంగా, అక్రమంగా వాడుతున్న ఏపీ ఫైబర్ నెట్ ను అనర్హత జాబితాలో చేర్చాలని లేఖలో రఘు రామ కృష్ణంరాజు పేర్కొన్నారు. తక్షణమే చర్యలు తీసుకొని, అక్రమ లైసెన్స్ ను రద్దు చేయాలని, అంతే కాక తప్పుడు సమాచారాన్ని ఏపీ ఫైబర్ నెట్ సంస్థ పంపిణీ చేయకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన లేఖలో రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: