టి ఆర్ ఎస్ పార్టీ జల దృశ్యం లో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ దాకా వెళ్లిందని ఆ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు పేర్కొన్నారు,  రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అభివృధి లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు. ఇతర పార్టీలు అధికారమే ఎజెండాగా పనిచేస్తే, టి ఆర్ ఎస్ లక్ష్యం కోసం పని చేస్తుందన్న హరీష్ రావు రేవంత్ పీసీసీ, బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులు కావడానికి కారణం కేసీఆర్ మాత్రమేనని అన్నారు. ఇక రేపటి నుంచి గ్రామ, పట్టణ, జిల్లా కమిటీలు పూర్తి చేయాలని పార్టీ నిర్ణయించిందన్న హరీష్ రావు మేము బ్రతికి ఉండగా నీరు రావన్న ప్రతి పక్షాలకు మల్లన్న సాగర్ లో పారుతున్న గోదావరి తల్లే సజీవ సాక్ష్యమని అన్నారు. ఇక ఈటెలను ఎక్కువగా హరీష్ రావు టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: