ఒక్కోసారి చేస్తున్న తన అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేస్తున్న పనులు పవన్ కళ్యాణ్ కి తలనొప్పిగా మారుతున్నాయి, తాజాగా  పశ్చిమ గోదావరి  జిల్లా ఉంగుటూరు మండలం తల్లాపురం ప్రాథమిక పాఠశాలలో జనసేన నాయకులు అత్యుత్సాహం ఆ వివాదాస్పదంగా మారింది. జనసేన అధినేత పవన్ బర్త్ డే వేడుకల్లో పాఠశాలలో స్టేషనరీ పంపిణీ పేరుతో పార్టీ ప్రచారం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి, విద్యార్థులతో జనసేన కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టించినట్టు కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, పిల్లలతో స్కూల్ లోనే జనసేన పార్టీ జెండా మోయించడం పై  పెద్ద ఎత్తున దుమారం రేగడంతో విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి.  దీంతో ఉంగుటూరు మండలం ఎంఈఓ హనుమ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది, దీని వెనుక ఎవరు ఉన్నారు ? ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనే విషయాల మీద విచారణ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: