ఆంధ్ర ప్రదేశ్ లో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీ చర్చనీయాంశంగా మారింది, ఇవి సాధారణ ప్రక్రియలో భాగంగా జరిగిన బదిలీలే అని చెబుతున్నా రాజకీయ కారణాలు కూడా ఉండే ఉంటాయని అంటున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఏఎంఆర్ డీఏ కమిషనర్ గా కె.విజయ, సీసీఎల్ఏ అప్పీల్స్ కమిషనర్ గా డా.పి.లక్ష్మీ నరసింహం, ఏఎంఆర్ డీఏ అడిషనల్ కమిషనర్ గా పి. ప్రశాంతి, గుంటూరు జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అభివృద్ధి జేసీగా జి.రాజ కుమారి, కడప ఆర్డీవోగా పి.ధర్మ చంద్రారెడ్డి,  ఎనర్జీ డిపార్ట్ మెంట్ డిప్యూటీ సెక్రటరీగా పృథ్వీ తేజ్ లను బదిలీ చేయగా ఏపీ పవర్ కార్పొరేషన్ ఎండీగా పృథ్వీతేజ్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక కొద్ది రోజుల నుంచి అన్ని విషయాల్లో ఐఏఎస్ అధికారులు కోర్టులో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: