రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరీంనగర్ ఎంపీ, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అక్షరీకర వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థలను కేసీఆర్ అనే మూర్ఖుడు నాశనం చేస్తున్నారని పేర్కొన్న ఆయన సర్పంచ్ లకు కేసీఆర్ ఒక్క రూపాయి ఇవ్వలేదని అన్నారు. 300 ఎకరాల ఫార్మ్ హౌస్ లో కేసీఆర్ దొడ్డు వడ్లు పండిస్తున్నారని, మరి రైతులు ఎందుకు సన్న వడ్లు పండించాలి? అని ఆయన ప్రశ్నించారు. ఏడేళ్లలో ఒక్కరికి కూడా పంట నష్ట పరిహారం ఇవ్వలేదని ఆయన అన్నారు. పంట నష్టపోయిన యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని, పండించిన ప్రతి గింజా కొనాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ కిలోమీటర్ కో బార్ పెట్టాడని, కేసీఆర్ ఇంట్లోనే ఐదు ఉద్యోగాలు ఉన్నాయని, భాషలో నాకు గురువు కేసీఆరేనని ఆయన చెప్పుకొచ్చారు, మరి బండి సంజయ్ మాటలకు టీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మరి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: