సైబరాబాద్ లో జరిగిన దొంగతనం కేసులో పోలీసుల అదుపులో నేపాల్ దొంగలు ఉన్నారని అంటున్నారు. గచ్చిబౌలి టెలికాం నగర్ లో చోరీకి పాల్పడిన నేపాలీ దొంగలను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఈ భారీ చోరీకి పథకం వేసింది నేత్ర బహదూర్ సాహి అలియాస్ నేత్ర ముఠాగా పోలీసులు తేల్చారు. ఈ నెల 20 న గోవింద రావు శ్రీశైలం వెళ్లడంతో అతని ఇంట్లో 110 తులాల బంగారం, పది లక్షల నగదు చోరీ చేసి నేపాలీ గ్యాంగ్ పరారీ అయింది, నాలుగు నెలల కింద గోవిందా రావు ఇంట్లో వాచ్ మెన్ గా జాయిన్ అయిన నేపాలీని ఈ దొంగతనం కోసం వాడారు. ఇక గతంలో కూడా రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేపాలీ గ్యాంగ్ ఇలాంటి చోరీలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈరోజు సాయంత్రం మీడియా ముందుకు నేపాలీ గ్యాంగ్ ను తీసుకొచ్చి సీపీ స్టీఫెన్ రవీంద్ర మరిన్ని వివరాలు వెల్లడించనున్నారని అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: