కృష్ణా జిల్లా ప‌రిష‌త్ కార్యాల‌యం వ‌ద్ద ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు నెల‌కొన్నాయి . కృష్ణా జిల్లా పరిషత్ కార్యాలయం లోకి ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు చొచ్చుకువ‌చ్చిన‌ట్టు స‌మాచారం . కార్య క‌ర్త‌లతో క‌లిసి భారీ ర్యాలీగా జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిని ఉప్పాల హారిక రాము త‌ర‌లి వ‌చ్చారు . కానీ జడ్పీ కార్యాలయంలోకి కార్యకర్తలను పోలీసులు అనుమ‌తించ‌లేదు . దాంతో ఆగ్రహంతో ఒక్కసారిగా జడ్పీ కార్యాలయంలోకి కార్య‌క‌ర్త‌లు చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు . 

కానీ కార్యకర్తలను పోలీసులు కింద ప‌డిపోయినట్టు స‌మాచారం . అయినప్ప‌టికీ ఆగ‌కుండా పోలీసులను తోసుకుపోయి వైసీపీ కార్య‌కర్త‌లు ముందుకు వెళ్లిన‌ట్టు తెలుస్తోంది . ఈ తోపులాటలో చాలా మంది పోలీసులు కింద‌ పడిపోయినట్టు స‌మాచారం . ఇక ప‌రిష‌త్ కార్యాల‌యం వ‌ద్ద కార్య‌క‌ర్త‌ల ఆందోళ‌న‌తో అటు అధికారులు మ‌రియు పోలీసులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: