పాము కాటు ప్రమాదాలు ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతున్నాయి. ఎక్కడో ఒక చోట ఈ ప్రమాదాలు ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి. వర్షా కాలంలో ఈ ప్రమాదాలను మనం ఎక్కువగా చూస్తున్నాం. నదుల్లో వరద తో పాటుగా భారీగా కొట్టుకు వస్తున్న పాములు ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి. తాజాగా ఒక ఘటన కర్నూలులో కన్నీరు పెట్టించింది. అవుకుకు చెందిన శ్రీకాంత్(28) పాముకాటుతో మృతి చెందాడు.

శ్రీకాంత్ ప్రస్తుతం 108 అంబులెన్స్ లో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నారు. డ్యూటీ లో భాగంగా కర్నూలు నుండి తిరిగి వస్తుండగా టాయిలెట్ కోసం నన్నూరు వద్ద అంబులెన్స్ ఆపిన శ్రీకాంత్ ను పాము కాటేసింది. అనుకుకుండా పాముకాటు వేయడంతో చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి శ్రీకాంత్ ను   తరలించారు. మార్గ మధ్యలో అదే అంబులెన్స్ లో శ్రీకాంత్ ప్రాణాలు కోల్పోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap