మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు కి సంబంధించి సిబిఐ అధికారుల విచారణలో ఏం బయటపడుతుంది ఏంటీ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 114 వ రోజు కొనసాగుతున్న సీబిఐ విచారణ లో మరో అరెస్ట్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా సాగుతున్న  సిబిఐ  విచారణ కీలక దశకు చేరుకున్నట్టు ఉంది.

దాదాపు చివరదశకు చేరుకున్న విచారణలో కీలక అనుమానితులను విచారిస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్ట్ లు కొనసాగుతూనే ఉన్నాయి. నేడు కీలక అనుమానితుడు వివేకా డ్రైవర్ దస్తగిరిని సిబిఐ అధికారులు కోర్టుకు హాజరు పరచే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే సునీల్ కుమార్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి లను అరెస్ట్ చేసిన సిబిఐ అధికారులు 3 వ అరెస్ట్ దస్తగిరి, కోర్టు అనుమతి రాగానే 4 వ అరెస్ట్ ఎర్రగంగిరెడ్డి ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: