ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏది చేసినా కాస్త కొత్తగానూ ట్రేండింగ్ గాను ఉంటుంది. తాజాగా మోడీ తన ట్విట్టర్ ఖాతా నుండి జాపనీస్ లాంగ్వేజ్ లో పోస్ట్ చేయడం చూసి అంతా ఆశ్చర్య పోతున్నారు. జపాన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఫ్యూమియో కిషిడా కు శుభాకాంక్షలు తెలుపుతూ మోడీ ట్వీట్ చేసారు.


 ప్రస్తుతం ఈ ట్వీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది .మోడీ ట్వీట్ సారాంశం ఏమిటంటే " జాపనీస్ నూతన ప్రధానిగా నూతన భాద్యతలు చేపట్టిన ఫ్యూమియో కిషిడాను మేము అభినందిస్తున్నాము మరియు భవిష్యత్తులో అతనికి మంచి జరగాలని కోరుకుంటున్నాము. ఇండియా తో జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇంకా ప్రాంతాల మధ్య మరియు బయట శాంతిని మరియు శ్రేయస్సును ప్రోత్సహించడానికి మేము ఎదురు చూస్తున్నాము". భవిష్యత్తులో జపాన్ తో ఇండియాకు మంచి అవినాభావ సంబంధాలు కొనసాగాలని ప్రధాని మోడీ ఆకాంక్షిస్తున్నట్లు  ఆ ట్వీట్ ద్వారా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: