ఏపీ లోని తూర్పుగోదావరి జిల్లాలో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక కుక్క కడుపున ఏనుగు రూపంలో ఉన్న కుక్క పిల్ల జన్మించడం ఆసక్తి రేపుతోంది. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుక్క కడుపున పుట్టిన కుక్కపిల్లకు ఏనుగును పోలిన తొండం ఉండటంతో దాన్ని చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

 గ్రామానికి చెందిన నర్సయ్య అన్నవరం అనే దంపతులు రెండేళ్లుగా ఒక కుక్కను పెంచుకుంటున్నారు. కాగా తాజాగా నాలుగు పిల్లలకు ఆ శునకం జన్మనిచ్చింది. అయితే ముందు పెట్టిన మూడు పిల్లలు సాధారణంగా ఉండగా ఆ తర్వాత పుట్టిన నాలుగవ పిల్ల వినాయకుని ఆకారం లో కనిపించడంతో దంపతులు ఆశ్చర్యపోయారు. ఇక ఈ వార్త గ్రామస్థులకు... చుట్టు పక్కల గ్రామాల వారికి చేరడం తో భారీగా వచ్చి చూస్తూ..వినాయకుడి రూపంలో ఉండటం తో పూజలు కూడా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: