నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని ఓ దుర్మార్గుడు  తాగి  మతి భ్రమించిన స్థితిలో తన చెల్లితోబాటు అతి కిరాతకంగా తన నాటు తుపాకీతో కాల్చి  చంపాడు ఆ తాగుబోతు . వివరాల ప్రకారం కర్ణాటకలోని  దక్షిణ కన్నడ జిల్లా లోని  సిద్ధాపుర తాలూకా కుడగోడు నందు జరిగింది. చిన్నప్పటినుండి చెడు వ్యసనాలకు బానిసగా మారిన  మంజునాథ్‌ అనే వ్యక్తి గురువారం నాడు అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు  . ఈ క్రమంలో అతడు భోజనం అడుగగా ఉన్నంతలో తాము చేసుకున్న సాంబారు కూరతో అతడికి భోజనం పెట్టారు.


అయితే ఆ పప్పుచారు రుచిగలేదు ఇంకా చప్పగా ఉందంటూ తల్లి  పార్వతి(42), సోదరి రమ్య(19) లతో గొడవ పడ్డాడు. అయితే కోపంతో ఊగిపోయిన అతగాడు  తన తల్లి , చెల్లిని నాటు తుపాకీ సహాయంతో కాల్చి చంపాడు. తల్లి  పార్వతి, సోదరి రమ్య అక్కడికక్కడే  తీవ్ర రక్త స్రావం జరిగి మరణించారు. ఈ విషయాన్నీ స్థానికులు సిద్ధాపూర్ పోలీస్టేషన్ కి సమాచారం ఇవ్వగా పోలీసులు మంజునాథ్‌ పై  కేసునమోదు చేశారు. ప్రస్తుతం ఆ విషయమై విచారణ చేపట్టారు. అతడికి గన్ ఎలా వచ్చింది , అతడి నేరచరిత్ర గురించి అరా తీస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: