గుంటూరు జీజీహెచ్లో కిడ్నాప్ కలకలం రేగింది. తెల్లవారుజామున మూడున్నర గంటలకు అప్పుడే పుట్టిన బాలుడిని కిడ్నాప్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్ పై తల్లి తండ్రులు వైద్యులకు ఫిర్యాదు చేశారు. అయితే బాలుడి తాత మరియు నాయనమ్మ వార్డ్ లో నుండి పసికందును బయటకు తీసుకొని వచ్చారు అనేది సమాచారం. పసికందు పుట్టి కేవలం నాలుగు రోజులే అవుతుందని తల్లి తండ్రులు చెబుతున్నారు.

బిడ్డ కనిపించక పోవడం తో తల్లి తల్లడిల్లిపోతోంది. వెంటనే తన బిడ్డ ను పట్టుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటన పై పసికందు తల్లి తండ్రులు ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఆస్పత్రిలో సీసి కెమెరా ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక జీజీహెచ్ నుండి పసికందు మాయం అవ్వడం పై బాధితుల బందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు కనీస భద్రత లేకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: