ఈ మధ్య కాలంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జరుగుతున్న ఘటనలు కాస్త సంచలనం అయ్యాయి. పాము రావడం ఒకటి బాగా హైలెట్ అయింది. ఇక ఇప్పుడు మరో ఘటన సంచలనంగా మారింది. మూడు రోజుల పసి కందుని కిడ్నాప్ చేయడం సంచలనం అయింది. ఇక ఆస్పత్రి సిబ్బందే ఈ కిడ్నాప్ కు పాల్పడ్డారు అని పోలీసులు గుర్తించారు. వారిని గుంటూరు నగరంలోనే అదుపులోకి తీసుకున్నారు.

ఇక ఈ ఘటనపై జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిలో సెక్యురిటి లోపాలు లేవని అన్నారు ఆమె. విషయం తెలుసుకున్న వెంటనే కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసాము అని వివరించారు. అమ్మమ్మ పాలు పట్టించడానికి బయటకు వచ్చిందని బిడ్డను బయటకి ఇవ్వము అంటే బతిమిలాడారు అని బాబుని పక్కన పెట్టుకొని నిద్రపోవడం వల్లనే బాబు ని కిడ్నాప్ చేశారు అని ఆమె తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap