ఏపీలో ఈ మధ్య కాలంలో కొంతమంది రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల విషయంలో కాస్త ప్రజల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రధానంగా రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఇబ్బందికరంగా ఉంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా డిప్యూటీ సీఎం ఈ అంశం గురించి మీడియా ప్రశ్నిస్తే కాస్త భిన్నంగా సమాధానం చెప్పారు.

డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ  మీడియా పై ఫైర్ అయ్యారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్ నూతన బిల్డింగ్ కు శంకుస్ఠాపన చేసిన డిప్యూటీ సి.ఎం... రైతులవద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయడం లేదని అడిగిన ప్రశ్నకి  నీది ఏ పార్టీ... ఏ పత్రిక.. పాజిటివ్ ఆలోచించండి అంటూ టిడిపి వాళ్లకు పనిపాట లేదు. వాళ్లేదో మాట్లాడుతారు... అదెందుకు అని ఫైర్ అయ్యారు. జగన్మోహనరెడ్డి సి.ఎం. అయ్యాక  పంటలు బాగా పండుతున్నాయి అని గత ఏడాది రైస్ మిల్లర్లు కూడా రైతులకు కోపరేట్ చేశారు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp