సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఇప్పుడు ఏ పార్టీలో చేరతారు ఏంటనే దానిపై చాలా వరకు చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇటీవల టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో ఆయన పరోక్షంగా పాల్గొంటున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా మీడియా వర్గాల్లో మనం చూస్తున్నాం.

సీఎం కేసీఆర్ అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తే భారతీయ జనతా పార్టీ హాజరు కావొద్దని చెప్పినా సరే మోత్కుపల్లి నర్సింహులు హాజరు కావడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆయన పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారు అయిందని కూడా తెలుస్తోంది. సోమవారం ఆయన మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారని సమాచారం ఆయనతో పాటుగా పలువురు బీజేపీ నాయకులు కూడా టిఆర్ఎస్ లో జాయిన్ అయ్యే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts