టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ త్వరలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని వార్తలు వినపడుతున్నాయి. గత కొంతకాలంగా అనంతపురం జిల్లా టిడిపి నేతల మధ్య విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో పరిష్కారం కోసం నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగారని ఈ నేపథ్యంలోనే జెసి దివాకర్ రెడ్డి కుటుంబం తో ఇబ్బంది పడుతున్న కొంతమంది కీలక నాయకులతో ఫోన్లో మాట్లాడాలని వాళ్ళందరూ కలిసి బాలకృష్ణ జెసి దివాకర్ రెడ్డి కుటుంబంతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ముఖ్యంగా కొంతమంది నియోజక వర్గాల నాయకులు జెసి దివాకర్ రెడ్డి కుటుంబాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు బాలకృష్ణ సిద్ధమవుతున్నారని కూడా అంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ఈ అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడుతో కూడా చర్చిస్తున్నారని త్వరలోనే ఆయన హిందూపురం పర్యటనకు వెళ్లిన తర్వాత అనంతపురంలో సమావేశం జరుగుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: