కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ త్వరలో అమరావతి ఉద్యమానికి మద్దతు పలికే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నెల మూడోవారంలో రాహుల్ గాంధీ అమరావతి ఉద్యమానికి మద్దతు పలికే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి త్వరలో ఆయన వచ్చే అవకాశం ఉందని పార్టీ కీలక నేతలతో కలిసి ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రావచ్చని అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యమానికి సంబంధించి ఆయన మద్దతు పలికే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది.

మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ ఇటీవల మాట్లాడుతూ కొన్ని కీలక ప్రకటనలు కూడా చేశారు. దీనితో రాహుల్ గాంధీ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తారు ఏంటనే దానిపై ఆసక్తి పెరుగుతున్న తరుణంలో నేడు జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారని రాహుల్ గాంధీతో పాటు సచిన్ పైలెట్ కూడా వచ్చే అవకాశం ఉందని అలాగే ప్రియాంక గాంధీ కూడా అమరావతి ఉద్యమానికి మద్దతు పలికే అవకాశాలు ఉండొచ్చని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: