ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ త్వరలో ప్రజల్లోకి వచ్చి అంశానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రజల్లోకి జగన్ ఎప్పటినుంచి వస్తారనే ప్రచారం జరుగుతుంది. గత ఏడాది ఆయన ఆగస్టులో ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందని అలాగే ఈ ఏడాది ఆగస్టులో కూడా జగన్ ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపించాయి.

ప్రజల్లో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి జగన్ ఎమ్మెల్యేలతో ఇప్పటికే మాట్లాడుతున్నారని త్వరలోనే ఆయన క్షేత్రస్థాయి పర్యటనలు కూడా చేసే అవకాశాలు ఉండవని అలాగే గ్రామ సచివాలయాలు పనితీరు రైతు భరోసా కేంద్రాల పనితీరు గురించి జగన్ తెలుసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. డిసెంబర్ రెండో తారీకు నుంచి జగన్ ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర నుంచి జగన్ పర్యటన మొదలు పెట్టవచ్చని లేదా రాయలసీమ జిల్లాల నుంచి మొదలు పెట్టవచ్చని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: