మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ముగిసి విష్ణు ప‌ద‌వి చేప‌ట్టిన‌ప్ప‌టికీ రాజుకున్న వేడి మాత్రం చ‌ల్లార‌లేదు. అస‌లు విష‌యాలు ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. క‌మ్మ‌-కాపు సామాజిక‌వ‌ర్గాల మ‌ధ్య పోటీగా కొంద‌రు వీటిని అభివ‌ర్ణించారు. అందుకు త‌గ్గ‌ట్లుగా ఎన్నిక‌ల ప్ర‌చారంలోకానీ, త‌ర్వాత కానీ వ్యూహాలు అమ‌ల‌య్యాయి. నంద‌మూరి బాల‌కృష్ణ‌ను మంచు విష్ణు క‌లిశారు. ఏపీలో రాజ‌కీయ ప‌రిస్థితులు ఏమిటి అనే ప‌ర్య‌వ‌సానాలు ఆలోచించ‌కుండా.. అస‌లు ఏం జ‌రుగుతోంది అనే విష‌యాలు తెలుసుకోకుండా ఆయ‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించేశారు. ఆ త‌ర్వాత మోహ‌న్‌బాబు చిన్న కుమారుడు మంచు మ‌నోజ్ వెళ్లి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను క‌లిశారు. ఇదంతా చూడ‌టానికి సాధార‌ణంగా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ, ఒక కొడుకు బాల‌కృష్ణ‌ను, ఒక కొడుకు ప‌వ‌న్‌ను క‌ల‌వ‌డంవెన‌క రాజ‌కీయ వ్యూహం అమ‌లైంది. ప్ర‌జ‌ల‌ను గంద‌ర‌గోళంలో ప‌డ‌వేయ‌డానికి, కాపుల‌ను ఓడించ‌డానికి క‌మ్మ‌, రెడ్డి క‌లిసి ప‌నిచేశారు అనే ప్ర‌చారం చేయ‌డానికి ఈ క‌ల‌వ‌డాలు ఉప‌యోగ‌ప‌డ్డాయి. చివ‌ర‌కు ఒక‌రు ఆడిన మైండ్‌గేమ్‌కు అంద‌రూ, అన్నిర‌కాలుగా ఉప‌యోగ‌ప‌డ్డారు. ఇందులో ఎవ‌రి అవ‌స‌రాలు వారివి.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa