నందమూరి బాలకృష్ణ హిందూపురం పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో ఇప్పుడు ఎటువంటి పరిణామాలు అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంటాయి ఏంటి అనే దానిపై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ కొంతమంది అనంతపురం జిల్లా నేతలతో సీరియస్ గా  సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ప్రధానంగా కాల్వ శ్రీనివాసులు తో నిర్వహించబోయే సమావేశం తర్వాత ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

అదేవిధంగా మాజీమంత్రి పల్లె రఘునాథ రెడ్డి తో అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా బాలకృష్ణ కీలక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని అనంతపురం జిల్లాలో పార్టీ నిర్మాణం కోసం బాలకృష్ణ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి. బాలకృష్ణ దాదాపుగా అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు కూడా వినబడుతున్నాయి. మరి ఎంతవరకు విజయవంతం అవుతుంది ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: