ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌, అదానీ గ్రూప్ గౌతం అదానీ చాలా స‌న్నిహితంగా మెదులుతున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ముఖ్యంగా అదానీ గ్రూప్ సొంతం చేసుకుంటున్న ఇత‌ర వ్యాపార‌స్తుల ఆస్తుల‌న్నీ ఏపీలోనివే కావ‌డం విశేషం. అదే త‌మిళ‌నాడుకో, తెలంగాణ‌కో, క‌ర్ణాట‌క‌కో, మ‌హారాష్ట్ర‌కో వెళితే త‌మ ఊరు, త‌మ నేల‌, త‌మ భాష అంటూ త‌మ ప్రాంతంపై ప్రేమ‌తో ఉండే ప్ర‌జ‌లే తిరుగుబాటు చేసేవారు. ఏపీలో ఆ అవ‌కాశం లేదు. ఎందుకంటే ఇక్క‌డ ప్ర‌జ‌లు కులాల విద్వేషంలో కొట్టుకుంటున్నారు. కుల విష‌వ‌ల‌యంలో చిక్కుకుపోయారు. రాజ‌కీయ నేత‌ల వ్యూహాల‌కు వీరు పావులుగా మారారు. కాబ‌ట్టి అదానీ లాంటివారికి ఏపీ చాలా సుర‌క్షితంగా ఉంటుంది. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేష‌న్లు.. ఇలా ఒక‌టంటూలేదు.. అన్నీ ద‌క్కించుకుంటున్న అదానీకి జ‌గ‌న్ స‌హ‌క‌రిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నారు. ఇక్క‌డ జ‌గ‌న్‌కు అండ‌గా అదానీ ఉంటే.. అదానీకి అండ‌గా న‌రేంద్ర‌మోడీ ఉన్నార‌ని ప్ర‌జ‌లు వ్యాఖ్య‌నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: