మా ఎన్నిక‌ల వేడి మాత్రం చ‌ల్లార‌డంలేదు. ఎప్పుడు అగ్నిప‌ర్వతం బ‌ద్ద‌ల‌వుతుందో, ఎప్పుడు లావా బ‌య‌ట‌కు వ‌స్తుందోన‌నే ఉత్కంఠ అంద‌రిలో నెల‌కొంది. తాజాగా చిరంజీవి మోహ‌న్ బాబుకు ఫోన్ చేశారు. తాను ఎవ‌రికీ మ‌ద్ద‌తివ్వ‌లేదని చెప్పారు. అంద‌రం క‌లిసుండాల‌నేది త‌న అభిమత‌మ‌న్నారు. అన‌వ‌స‌రంగా త‌న పేరు బ‌య‌ట‌కు లాగార‌న్నారు. దీనికి మోహ‌న్‌బాబు కూడా అది ఎన్నిక‌ల వ‌ర‌కేన‌ని, అంద‌రూ క‌లిసిక‌ట్టుగా మాను అభివృద్ధి చేద్దామ‌న్నారు. మ‌రోవైపు నాగ‌బాబు అన్న‌య్య ప్ర‌కాష్ రాజ్‌కు మ‌ద్ద‌తిచ్చార‌ని, ఆయ‌న‌కు ఓటేయాల‌ని ప్ర‌చారం చేశారు. ఆ స‌మ‌యంలో చిరంజీవి వాటిని ఖండించ‌లేదు. ఇప్పుడు మోహ‌న్‌బాబుతో తాను ఎవ‌రికీ మ‌ద్ద‌తివ్వ‌లేదంటున్నారు. ఇదేం రాజ‌కీయ‌మో అర్థం కాక ప్ర‌జ‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. తన‌ను పోటీనుంచి విర‌మించుకోమ‌ని త‌న తండ్రి మోహ‌న్‌బాబుకు చిరంజీవి అంకుల్ ఫోన్‌చేశార‌ని విష్ణు తెలిపారు. నాగ‌బాబు ఒక‌లా చెబుతున్నారు.. చిరంజీవి మ‌రోలా చెబుతున్నారు అంటూ ఇప్పుడు ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa