ఈరోజు మా ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు ప్యానల్ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయగా సీనియర్ నటుడు బాబు మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న వివాదాలను తాము వదిలి వేయాలని అనుకున్నప్పటికీ ప్రత్యర్థి ప్యానల్ మాత్రం వదలడం లేదని ఆరోపించారు. అందరం కళామతల్లి బిడ్డలం అన్న సంగతి మర్చిపోకూడదు అని అన్నారు. అధ్యక్షుడిగా విష్ణు ఇప్పుడే కాకుండా ఆ తర్వాత రెండేళ్లు కూడా కొనసాగుతాడని బాబు మోహన్ వ్యాఖ్యానించారు.

ఓడిన వాళ్ళకి కూడా విష్ణు నే అధ్యక్షుడు అని ప్రత్యర్థి ప్యానల్ గుర్తుంచుకోవాలన్నారు. ప్రత్యర్థి ప్యానల్ ఆవేశం తగ్గించుకోవాలని మోహన్ బాబు మోహన్ హితవు పలికారు. విష్ణు ను అంగీకరించకపోతే తెలుగు రాష్ట్రాల ప్రజలు క్షమించరని బాబు మోహన్ వ్యాఖ్యానించారు. ప్రత్యర్థి ప్యానల్ సభ్యులు సహకరించాలని అందరి క్షేమమే తమ పరమావధి అని బాబు మోహన్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: