నేడు ఉదయం మంగళగిరి పార్టీ ఆఫీస్ లో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అదేవిధంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. టిడిపి సీనియర్ నేత నక్కా ఆనందబాబు కి నోటీసులు ఇవ్వడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. 

ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసిపి నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు. పార్టీ కేంద్ర కార్యాలయంలోకి వెళ్లి అక్కడున్న ఫర్నిచర్ మనలాగే కనపడని వారిపై రాళ్లు రువ్వారు. ఘటన గురించి తెలుసుకున్న వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెంటనే బయలుదేరి కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. పట్టాభి కుటుంబ సభ్యులతో కూడా చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: