ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా నేడు సాయంత్రం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ళ పై వైసీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. ఆంధ్రప్రదేశ్ లో మాదకద్రవ్యాలకు సంబంధించి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశం తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లక్ష్యంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో పట్టాభి ఇంటి పై కొంత మంది వైసీపీ కార్యకర్తలు దాడులు జరగడమే కాకుండా టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటిపై కూడా హిందూపురంలో దాడికి దిగారు. హిందూపురం పార్టీ కార్యాలయంపై దాడికి దిగినట్లుగా తెలుస్తోంది.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీ నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం హిందూపురంలో బాలకృష్ణ ఇంటి వద్ద భారీగా వైసిపి కార్యకర్తలు మోహరించినట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: