టిడిపి నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసిపి కార్యకర్తలు ఒక రకంగా విధ్వంసం సృష్టించారని ఆరోపణలు వినపడుతున్నాయి. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం వైసిపి నాయకులు కార్యకర్తలు కొంతమంపట్టాభి ఇంటిపై దాడికి దిగడం ఇదే కాకుండా ఆయన ఇంట్లో వస్తువులను కూడా ధ్వంసం చేయడం గమనార్హం. ఈ సమయంలో పట్టాభి ఇంట్లో ఉన్న పనిమనిషి పట్టాభి ఐదేళ్ల కూతుర్ని బాత్రూంలో దాచినట్టుగా తెలుస్తోంది. కొన్ని మీడియా ఛానల్స్ కథనం ప్రకారం పట్టాభి డ్రైవర్ మెడ పై వైసిపి కార్యకర్తలు కొంతమంది కత్తులు పెట్టారని కూడా వార్తలు వస్తున్నాయి.. పక్కా ప్రణాళికతో దాడులు చేశారని ఆరోపణలు వస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై కొంతమంది నాయకులు ఇళ్లపై వైసిపి నాయకులు కార్యకర్తలు దాడులకు దిగిన వార్తలు వస్తున్నాయి.ఈ దాడులకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర గవర్నర్ కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: