ఏపీ డీజీపీ కి తెలియకుండా ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై దాడులు జరగలేదని అన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. డీజీపీ కి తెలియకుండా ఈ దాడి జరగలేదు ఆయనకు తెలుసు అని ఆయన విమర్శలు చేసారు. గంజాయి ఉత్పత్తి చేస్తున్నారు వేరే రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు అని మాట్లాడడం తప్పు కాదా అని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్ర, తమిళనాడు లో గంజాయి పట్టుకున్నారు అని డీజీపీ పేర్కొన్నారు.

తెలంగాణ పోలీస్ లు చెపుతున్నారు తమది డ్రగ్ ఫ్రీ స్టేట్  అని... మరి ఏపీ సంగతి ఏంటి అని ప్రశ్నించారు. వైసీపీ నుంచి పిలుపు ఇస్తే అందరూ వచ్చి దాడులకు దిగారని చంద్రబాబు నాయుడు విమర్శలు చేసారు. ప్రజాస్వామ్యంపై దాడి చేస్తే భయపడతామా అని ఆయన ప్రశ్నించారు. అసలు డీజీపీ ఆ పదవికి పనికి వస్తారా అని చంద్రబాబు నాయుడు నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: