మాఫియాతో జాతి నిర్వీర్యమై పోతుంది అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ డీజీపీ లక్ష్యంగా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఆర్ యు ఫిట్ ఫర్  డీజీపీ అంటూ చంద్రబాబు నాయుడు డిజిపి లక్ష్యంగా ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో ఇంత హింస జరుగుతుంటే బిజెపి ఎందుకు స్పందించడం లేదని చంద్రబాబు నాయుడు నిలదీశారు. ఏపీలో పలుచోట్ల టీడీపీ  కార్యాలయాలపై నాయకుల పై దాడులకు దిగారు అని అన్నారు. నన్ను నేను కాపాడుకోగలనని ఎప్పుడు నా కోసం పోరాడ లేదని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు.

పులివెందుల రాజకీయం కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంటే చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.తిరుపతి విజయవాడ కర్నూలు ప్రొద్దుటూరులో కూడా వైసీపీ దాడులకు దిగింది అని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.అసలు డీజీపీ ఆ పదవికి పనికి వస్తారా అని చంద్రబాబు నాయుడు నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: