సమాజం లో నీతి , న్యాయం , మానవత్వం  అనేవి నానాటికి కనుమరుగౌతు ఉన్నాయి. సమాజం లో హత్యలు , మానభంగాలు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో అర్ధ రాత్రి ఓ యువకుడిని అతి దారుణంగా కత్తులతో నరికి చంపిన ఘటన వెలుగు చూసింది . మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడిని అతి కిరాతకంగా పొడిచి చంపిన ఘటన  హైదరాబాద్  హాబీబీనగర్ లో చోటు చేసుకుంది. షాదాబ్ అనే యువకుడిని  కొందరు యువకులు హబీబ్ నగర్ లో కత్తులతో దారుణంగా నరికి చంపారు.



 షాదాబ్  మంగళ్ హాట్ అనే ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. అతడు సొంతగా మంగళ్ హాట్ లో ఎలెక్ట్రీషిన్ పని చేసుకునేవాడని తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు హబీబ్ నగర్ కు చేరుకొని కేసునమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. అయితే హత్య చేసిన యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా బయటికి రాలేదు. అయితే పోలీసులు మాత్రం ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని అనుకుంటున్నారు  


మరింత సమాచారం తెలుసుకోండి: