టీడీపీ నేత ప‌ట్టాబి చేసిన వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేత‌లు ర్యాలీలు నిర్వ‌హిస్తున్నారు. ప‌ట్టాబి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేప‌డుతున్నారు. ఇదిలా ఉండ‌గా తాజాగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు విలేక‌ర్ల‌తో మాట్లాడారు. చంద్ర‌బాబు ఆడుతున్న వికృత క్రీడ వ‌ల్ల‌నే రాష్ట్రం లో నేడు ఈ ప‌రిస్థితి నెల‌కొన్న‌ద‌న్నారు. ఎవ‌రూ దాడులు చేసిన నేను స‌మ‌ర్థించ‌ను. దాడులు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాదు. సీఎం జ‌గ‌న్‌ను రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయ‌డం ద్వారా ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి రాష్ట్రంలో. తెలుగుదేశం పార్టీ అరాచ‌కాలు సృష్టిస్తే నామ‌రూపం లేకుండా పోతుంది. సీఎం జ‌గన్‌కు చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన చెప్పాలి.

చంద్ర‌బాబు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన‌ట్టు జ‌గ‌న్‌ను పొడ‌చ‌లేరు. ఆయన ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌డు. ఎన్టీఆర్ అమాయ‌కుడు కాబ‌ట్టి చంద్ర‌బాబు వెన్నుపోటు పొడిచాడు. నేను నేరుగా ప్ర‌శ్నిస్తున్నా చంద్ర‌బాబును ప‌ట్టాబి చేసిన వ్యాఖ్య‌లు మీరు స‌మ‌ర్థిస్తారా..?  రాష్ట్ర ముఖ్య‌మంత్రిని గౌర‌వించాలి. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు వైసీపీ నేత‌లు ఇలాగే చేశారా..?  నేడు టీడీపీకి బంద్‌కు ఎవ్వ‌రూ స‌హ‌క‌రించ‌డం లేదు. అదేవిధంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ చిరంజీవికి తమ్ముడు కాదు..  చంద్ర‌బాబుకు త‌మ్ముడు అని పేర్కొన్నారు. ఆ త‌రువాత వెంట‌నే చంద్ర‌బాబుకు ద‌త్త పుత్రుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ అని..  జ‌గ‌న్ చేసిన అభివృద్ధిని ఏనాడు ప‌వ‌న్‌ ఒప్పుకోలేదు. చంద్ర‌బాబు అడుగు జాడ‌ల్లోనే న‌డుస్తున్నాడ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు మంత్రి వెల్లంప‌ల్లి.



మరింత సమాచారం తెలుసుకోండి: