హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు బిజెపి నేతలు, తెరాస నేతల మధ్య మాటల యుద్ధం గట్టిగా సాగుతుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాస్త తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఎన్నికల ప్రచారం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. టీఆరెస్ లో నెక్స్ట్ బలయ్యేది హరీష్ రావే అని అన్నారు. హరీష్ రావు నీ పైన కేసీఆర్ టార్గెట్ పెట్టారు అని హెచ్చరించారు.

నువ్వు మంచోడివే.. కానీ అబద్దాలు మాట్లాడకు అని సూచించారు. కేసీఆర్ కుటుంబంలో నాలుగైదు కమిటీలు ఉన్నాయని అన్నారు. ఒకటి లంచం ఎలా తీసుకోవాలో ప్లాన్ చేసే కమిటీ అని ఒకటి మీడియా ముందు అబద్దాలు మాట్లాడే కమిటీ అని కవిత, కేసీఆర్, కేటీఆర్, హరీష్ లాఠీ దెబ్బలు తిన్నారా అని ప్రశ్నించారు. వేల కోట్లతో హుజురాబాద్ లో గెలవాలని అనుకుంటున్నారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts