ప‌ట్టాబి ఇంటి వ‌ద్ద హై టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. నిన్న సీఎం జ‌గ‌న్‌, వైఎస్సార్ సీపీ నాయ‌కుల‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా టీడీపీ కార్యాల‌యం, నాయ‌కుల‌పై దాడి చేసిన విష‌యం విధిత‌మే. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం మొత్తం భ‌గ్గుమంటుంది. ఉద‌యం నుంచి సాయంత్రం ఏపీలో ఉద్రిక్త‌తో కూడిన వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది.  ఎక్క‌డ చేసిన ఏపీ రాజ‌కీయం గురించే చ‌ర్చించుకుంటున్నారు.

వైసీపీ నాయ‌కులు ఉద‌యం  నుంచి త‌రుచూ ఎవ‌రో ఒక‌రు ప్రెస్ మీట్‌లో మాట్లాడుతున్నారు. ఏక్ష‌ణ‌మైనా ప‌ట్టాబిని అరెస్ట్ చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. పోలీసులు సీసీ పుటేజీ, హార్డ్ డిస్క్‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. హ‌ర్డ్‌డిస్క్ సంబంధించిన డీవీఆర్ ఎక్క‌డ ఉంద‌ని ఆరాతీశారు. సీసీ పుటేజీకి సంబంధించిన డేటా పెన్‌డ్రైవ్‌లో ఇచ్చేందుకు ప‌ట్టాబి స్నేహితులు ప్ర‌య‌త్నం చేశారు. పెన్ డ్రైవ్ తీసుకునేందుకు పోలీసులు నిరాకరించారు. మొత్తానికి ఏపీలో రాజ‌కీయం భ‌గ్గున మాడిపోతున్న‌ట్టు క‌నిపిస్తుంది. పోలీసులు ప‌ట్టాబీని అరెస్ట్ చేస్తారా లేక ఏమిటి అనేది కొద్దిసేప‌ట్లో తెలవ‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: