ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసుల చేత‌కానిత‌నం వ‌ల‌న రాష్ట్రంలో గంజాయి పెరిగిపోతున్న‌ద‌ని టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ వెల్ల‌డించారు. బుధ‌వారం టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో విలేక‌ర్ల‌తో మాట్లాడారు లోకేష్. ధైర్యం ఉంటే నేరుగా ప్ర‌త్య‌క్షంగా రావాలి. జ‌గ‌న్ త‌న పెంపుడు కుక్క‌లను పంపుతున్నారు. దాడి చేస్తే మేము భ‌య‌ప‌డం. కేంద్ర ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించాలి. రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత డ్ర‌గ్స్ లీగ‌ల్ అయ్యాయ‌ని ఆరోప‌ణ‌లు చేశారు. సీఎం జ‌గ‌న్ ఓ సైకో.. శాడిస్ట్ అని మండిప‌డ్డారు.
 
డ్ర‌గ్స్ గురించి, గంజాయి గురించి నిల‌దీసినందుకు దాడుల‌కు పంపుతున్నా అని ఆగ్ర‌హం అయ్యారు. ధైర్యం ఉంటే నేరుగా రావాలి, పెంపుడు కుక్క‌ల‌ను పంప‌డం కాదు. ప్లేస్ చెబితే తామే వ‌స్తాం.. అని లోకేశ్ సీఎం జ‌గ‌న్‌కు స‌వాలు విసిరారు. మ‌రోవైపు దాడులు జ‌రుగుతున్నాయ‌ని మా నాయ‌కుడు ఫోన్ చేసినా స్పందించ‌లేదు అని డీజీపీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌తంలో చంద్ర‌బాబును ఇష్టానుసారంగా తిట్టార‌ని, ఇది గుర్తుకు లేదా అని ప్ర‌శ్నించారు. బూతులు మాట్లాడిన వైసీపీ నాయ‌కులపై చ‌ర్య‌లు ఏవి అని పేర్కొన్నారు. ఏపీలో డ్ర‌గ్స్ ఎక్క‌డ ల‌భించినా అందులో ఏపీ పాత్ర ఉంటుంద‌ని వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: