తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో కొందరు నాయకులు ఆ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి రావడం ఆశ్చర్యంగా మారింది. తాజాగా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కొందరు నాయకులు ఆసక్తి చూపిస్తున్నారు. టీడీపీలో చేరిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి జీవీ రెడ్డిని... పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...

ప్రస్తుతం రాష్ట్రంలో క్రియాశీలక పార్టీలో చేరాలనే నిర్ణయంతో టీడీపీలో చేరాను అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు అభివృద్ధి కోరుకునే వ్యక్తి అయితే.. జగన్ వినాశనాన్ని కోరుకునే వ్యక్తి అని ఆయన మండిపడ్డారు. అదే విధంగా రాష్ట్రానికి మరింత నష్టం చేకూరడదంటే చంద్రబాబును బలపర్చాల్సిన అవసరం ఉంది అని జీవీ రెడ్డి అన్నారు. కొన్ని వర్గాలు చంద్రబాబుపై అకారణంగా ద్వేషం పెంచుకోవడం వలనే రాష్ట్రం నాశనమైంది అని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp