ఐప్యాక్ సంస్థ ద్వారా ఎన్నికల వ్యూహకర్తగా ఉంటూ రాజకీయ పార్టీలకు ప్రచారం చేస్తూ, ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతూ పనిచేయడంద్వారా ప్రశాంత్ కిషోర్ మంచిపేరు తెచ్చుకున్నారు. ప్రజలెలా పోయినా పర్వాలేదు.. తనకు మంచి ప్యాకేజీ ఇచ్చిన పార్టీ ఎన్నికల్లో గెలిచేలా ఆయన మంత్రాంగం చేస్తారు. అవసరమైతే ప్రజలమధ్య భావోద్వేగాలు రెచ్చగొడతారు. పశ్చిమ బెంగాల్లో మమత విజయం సాధించిన తర్వాత ఆయన ఐప్యాక్కు గుడ్బై చెప్పారు. కాంగ్రెస్లో చేరబోతున్నట్లు ప్రకటించారు. సోనియాగాంధీకి రాజకీయ సలహాదారుగా ఉండి తన భవిష్యత్తుకు మంచి బాట వేసుకోవాలనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆయనపై అసమ్మతి వ్యక్తమైంది. సలహాదారు సలహాదారుగానే ఉండాలని, ఎవరు ఎంతవరకు ఉంటే బాగుంటుందో అంతవరకే ఉండాలని పార్టీ నేతలు కొందరు అన్నారు. ఆయన సోనియాతో, ప్రియాంకతో, రాహుల్తో మాట్లాడినప్పటికీ ఆయన కోరుకున్న పదవి మాత్రం దక్కలేదు. దీంతో ఆయన తృణమూల్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఏ పదవి ఇస్తారో చూడాలి మరి..!!.
ఐప్యాక్ సంస్థ ద్వారా ఎన్నికల వ్యూహకర్తగా ఉంటూ రాజకీయ పార్టీలకు ప్రచారం చేస్తూ, ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతూ పనిచేయడంద్వారా ప్రశాంత్ కిషోర్ మంచిపేరు తెచ్చుకున్నారు. ప్రజలెలా పోయినా పర్వాలేదు.. తనకు మంచి ప్యాకేజీ ఇచ్చిన పార్టీ ఎన్నికల్లో గెలిచేలా ఆయన మంత్రాంగం చేస్తారు. అవసరమైతే ప్రజలమధ్య భావోద్వేగాలు రెచ్చగొడతారు. పశ్చిమ బెంగాల్లో మమత విజయం సాధించిన తర్వాత ఆయన ఐప్యాక్కు గుడ్బై చెప్పారు. కాంగ్రెస్లో చేరబోతున్నట్లు ప్రకటించారు. సోనియాగాంధీకి రాజకీయ సలహాదారుగా ఉండి తన భవిష్యత్తుకు మంచి బాట వేసుకోవాలనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆయనపై అసమ్మతి వ్యక్తమైంది. సలహాదారు సలహాదారుగానే ఉండాలని, ఎవరు ఎంతవరకు ఉంటే బాగుంటుందో అంతవరకే ఉండాలని పార్టీ నేతలు కొందరు అన్నారు. ఆయన సోనియాతో, ప్రియాంకతో, రాహుల్తో మాట్లాడినప్పటికీ ఆయన కోరుకున్న పదవి మాత్రం దక్కలేదు. దీంతో ఆయన తృణమూల్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఏ పదవి ఇస్తారో చూడాలి మరి..!!.