ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. ఏం జరగబోతుంది ఏంటీ అనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ ప్లాన్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఇక దీనికి కౌంటర్ అటాక్ గా వైసీపీ కూడా ఢిల్లీ టూర్ ప్లాన్ చేసింది. టీడీపీ నేతల ఢిల్లీ పర్యటనకు కౌంటర్ అటాక్ టూర్ ప్లాన్ చేసిన వైసీపీ... జాతీయ ఎన్నికల కమిషన్ ను కలిసి టీడీపీపై ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన సీఎం జగన్ మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించడంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనది అధికార పార్టీ. అసత్యాలు, అసభ్య పదజాలంతో  ప్రచారం చేస్తున్న టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడానికి వైసీపీ నాయకులు రెడీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: