డిజిపి గారూ! మాపైనా, మా కార్యాల‌యాల‌పైనా దాడిచేసినోళ్ల‌లో ఒక్క‌డినైనా అరెస్ట్ చేశారా?  అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. ఇదేం అరాచ‌కమ‌ని శాంతియుతంగా నిర‌స‌న తెలిపే టీడీపీ  నేత‌ల్ని అరెస్ట్ చేస్తారా? అంటూ ఆయన ఫైర్ అయ్యారు. మా నాయకులు ప‌ట్టాభి, నాదెండ్ల బ్ర‌హ్మం.. ఇలా అరెస్టు చేసుకుంటూ పోతే.. తెలుగుదేశం పార్టీలో 70 ల‌క్ష‌ల మందిని అరెస్ట్ చేయాలి అన్నారు లోకేష్. ఒక్క‌సారి బుర్ర‌త‌క్కువ‌ స‌ల‌హాదారుల బుర్ర‌తోకాకుండా చ‌దువుకున్న ఐపీఎస్ బుర్ర‌తో ఆలోచించండి అని ఆయన విజ్ఞప్తి చేసారు.

మీరు చేస్తున్న‌ది ఎంత త‌ప్పో తెలిసొస్తుంది..  నాదెండ్ల బ్ర‌హ్మంని నిన్న‌టి నుంచి స్టేష‌న్ల చుట్టూ తిప్పి.. తిప్పి ఏదో చేయాల‌నే మీ ప్లాన్ బెడిసికొట్టడంతో కొత్త డ్రామా మొద‌లుపెట్టారు అని ఆరోపించారు. నాదెండ్ల బ్ర‌హ్మంపై ఈగ వాలినా  మీదే బాధ్య‌త డిజిపి గారు అని హెచ్చరించారు. చ‌ట్టాన్ని అతిక్ర‌మించి చేసిన ప్ర‌తీ అరెస్టుకి, పాల్ప‌డిన ప్ర‌తీ అరాచ‌కానికీ న్యాయ‌స్థానాల ముందు త‌ల‌దించుకుని దోషిగా నిల‌బ‌డేందుకు సిద్ధంగా ఉండండని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: