ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్న నేపధ్యంలో టీడీపీ వేసే అడుగులు ఏ విధంగా ఉంటున్నాయి ఏంటీ అనేది ఆసక్తిని రేపుతున్న అంశంగా చెప్పాలి. రాష్టం లో టీడీపీ నేతలు,మరియు కార్యాలయాల పై దాడుల ను గవర్నర్ దృష్టి కి తెలుగుదేశం పార్టీ తీసుకువెళ్ళే ఆలోచనలో ఉందని వార్తలు వస్తున్నాయి. సాయంత్రం గవర్నర్ వద్దకు వెళ్ళడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు.

గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరి చందన్‌ను టీడీపీ నేతలు గురువారం సాయంత్రం కలుస్తున్నారు అని ఆ పార్టీ నేతలు తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు వారికి ఆయన సమయం ఇచ్చారు అని పేర్కొన్నాయి పార్టీ వర్గాలు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌, టీడీపీ నేతలు తదితరులు గవర్నర్‌ వద్దకు వెళ్తున్నారు అని టీడీపీ వర్గాలు తెలిపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: