ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైసీపీ, టీడీపీ నాయ‌కుల మ‌ధ్య గ‌త కొద్దిరోజుల నుంచి మాట‌ల యుద్ధంతో మొద‌లై దాడులు, నిర‌స‌న‌లు దారి తీసిన విష‌యం విధిత‌మే. తాజాగా తాడేప‌ల్లిలో వైసీపీ మంత్రి  పేర్నినాని గురువారం విలేక‌ర్ల‌తో మాట్లాడారు. చంద్ర‌బాబు నాయుడు బాధ్య‌త రాహిత్యం ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. ఆయ‌న‌ను ఇలా తిడితే ఊరుకుంటాడా..? అని  ప్ర‌శ్నించారు. రౌడి మూకాల‌తో మ‌ళ్లీ అవే మాట‌లు మాట్లాడిస్తున్నారు. అస‌లు చంద్ర‌బాబు దీక్ష పేరుతో కొంగ జ‌పాన్ని మొద‌లుపెట్టారు. అమిత్ షా ద‌గ్గ‌రికి వెళ్లితే అక్క‌డ ప్ర‌శ్నించ‌రా.? ఊరికే పార్టీ కార్యాల‌యం పై ఎందుకు దాడి చేశార‌ని అడ‌గరా..? 356 గురించి మాట్లాడే అర్హ‌త లేద‌న్నారు. పైన ఎన్టీరామారావు శాపాలు.. కింద చంద్ర‌బాబు పుత్న‌ర‌త్నం లోకేష్  మ‌ధ్య‌లో చంద్ర‌బాబు ఉన్నాడు.

కాంగ్రెస్ వినాశ‌నం కోసం తెలుగుదేశం పార్టీని ఆనాడు ఎన్టీఆర్ స్థాపించాడు. నేడు కుట్రల‌కు, కుతంత్రాల‌కు, బూతుల‌కు పెద్ద ఫ్యాక్ట‌రీగా మారింది. చంద్ర‌బాబునాయుడు వెన్నుపాటుదాడులు, ద‌గాకోరు, మోస‌గాడు, అక్ర‌మాల‌కు పాల్ప‌డుతాడు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బూతుల‌కు అర్థాలు వెతికే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. చంద్ర‌బాబు చేప‌ట్టిన దీక్ష దొంగ దీక్ష అని.. దీనికి తోడు ప‌క్క‌న క‌బ్జాకోరు కూర్చున్నాడ‌ని పేర్కొన్నారు. బూతుల కోసం దీక్ష‌లు చేసేవాడు.. ఇంత‌కంటే దిక్కుమాలిన వాడు ఈ ప్ర‌పంచంలో మెరెక్క‌డ ఉండ‌డు అని చంద్ర‌బాబుపై మండిప‌డ్డారు మంత్రి పేర్ని నాని.

 

మరింత సమాచారం తెలుసుకోండి: