దళితబంధు పథకం తెలంగాణ సీఎం కేసీఆర్ మాయ అని మాజీ ఎంపీ, బీజేపీ మహిళా నేత విజయశాంతి అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే చెత్త సీఎం కేసీఆర్ అని ఓ సర్వేలో తేలిందని, తెలంగాణ ద్రోహులను నెత్తిన పెట్టుకొని, ఉద్యమంలో పోరాడిన ఉద్యమకారులను నడి రోడ్డు మీద నిలబెట్టిన ఘనత చెత్త ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. అవసరం ఉన్నంత వరకు నాయకులను వాడుకొని వదిలేయడం ఆయనకు అలవాటేనని, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరుసార్లు గెలిచారని, పనిచేసే నాయకులను ప్రజల గుండెల్లో పెట్టుకుంటారనేదాన్ని తెలంగాణ ప్రజలు మరోసారి నిరూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఏడోసారి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ను గెలిపించాలని ప్రజలు ఎదురు చూస్తుననారని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేదానికి ఇది నిదర్శనంగా నిలుస్తుందన్నారు. కేసీఆర్ అబద్ధాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని, ఇప్పటికైనా ఆయన నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
దళితబంధు పథకం తెలంగాణ సీఎం కేసీఆర్ మాయ అని మాజీ ఎంపీ, బీజేపీ మహిళా నేత విజయశాంతి అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే చెత్త సీఎం కేసీఆర్ అని ఓ సర్వేలో తేలిందని, తెలంగాణ ద్రోహులను నెత్తిన పెట్టుకొని, ఉద్యమంలో పోరాడిన ఉద్యమకారులను నడి రోడ్డు మీద నిలబెట్టిన ఘనత చెత్త ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. అవసరం ఉన్నంత వరకు నాయకులను వాడుకొని వదిలేయడం ఆయనకు అలవాటేనని, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరుసార్లు గెలిచారని, పనిచేసే నాయకులను ప్రజల గుండెల్లో పెట్టుకుంటారనేదాన్ని తెలంగాణ ప్రజలు మరోసారి నిరూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఏడోసారి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ను గెలిపించాలని ప్రజలు ఎదురు చూస్తుననారని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేదానికి ఇది నిదర్శనంగా నిలుస్తుందన్నారు. కేసీఆర్ అబద్ధాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని, ఇప్పటికైనా ఆయన నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు.