తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాల‌యంతోపాటు రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో ఉన్న కార్యాల‌యాల‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు చేసిన దాడుల‌కు నిర‌స‌న‌గా ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు దీక్ష చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిన్న ఉద‌యం ఎనిమిది గంట‌ల‌కు ప్రారంభ‌మైన దీక్ష ఈరోజు రాత్రి ఎనిమిది గంట‌ల‌కు ముగియ‌నుంది. ప్ర‌కాశం జిల్లా అద్దంకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ అద్దంకి నుంచి మంగ‌ళ‌గిరి లోని పార్టీ కార్యాల‌యం వ‌ర‌కు 300 కార్ల‌తో భారీ ర్యాలీ చేప‌ట్టారు. నియోజ‌క‌వ‌ర్గంతోపాటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స‌త్తా చూపించ‌డానికే ఈ ర్యాలీ చేప‌ట్టిన‌ట్లు గొట్టిపాటి వెల్ల‌డించారు. అలాగే విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని కూడా విజ‌య‌వాడ నుంచి మంగ‌ళ‌గిరి వ‌ర‌కు కార్ల‌తో భారీ ర్యాలీతో వ‌చ్చారు. ఈ ఇద్ద‌రు నేత‌ల కార్ల ర్యాలీ చూసి తెలుగుదేశం పార్టీవ‌ర్గాలు హ‌ర్షం వ్య‌క్తం చేశాయి. ఒక‌ర‌కంగా ఈ ర్యాలీ త‌మ కార్య‌క‌ర్త‌ల్లో మ‌నోస్థైర్యాన్ని నింపుతుంద‌ని పార్టీ నాయ‌కులు అంటున్నారు. ప్ర‌భుత్వ ప్రేరేపిత ఉగ్ర‌వాదం పేరుతో చేస్తున్న ఈ దీక్ష ఈరోజు రాత్రికి ముగియ‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp