టీఆర్ఎస్ ప్లీన‌రీ స‌మావేశంలో అధ్య‌క్షుడిగా ఏక గ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ ఆస‌క్తిక వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ లో ప్రారంభించిన ప‌థ‌కాల‌ను దేశ వ్యాప్తంగా అమ‌లు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల ప్రారంభించిన ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌జ‌లు కూడా కావాలంటున్నార‌ని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా టీఆర్ఎస్ ను ఏపీలో కూడా స్థాపించాల‌ని విజ్ఞ‌ప్తులు వ‌స్తున్నాయంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. కేసీఆర్ కామెంట్లతో ఏపీ సీఎం జ‌గ‌న్ కు షాకిచ్చారు. 

ఏపీలో తెలంగాణ ప‌థ‌కాలు కోరుతున్నార‌ని చెప్ప‌డంతో సీఎం జ‌గ‌న్ ప‌రిపాల‌న పై అనుమానాలు లేవ‌నెత్తారు. అంతే కాకుండా క‌ర్నాట‌క‌లోని రాయ్ చూర్ ప్రాంతం వాళ్లు త‌మ‌ను తెలంగాణ‌లో క‌ల‌పాల‌ని కోరుతున్నార‌ని చెప్పారు. అంతేకాకుండా ఇటీవ‌లే ఓ ఎమ్మెల్యే ఏకంగా మంత్రి ముందు త‌మ రాష్ట్రంలో తెలంగాణ ప‌థ‌కాలు ప్రారంభించాల‌ని కోరుతున్న‌ట్టు చెప్పారు. తెలంగాణ‌లో వ‌రి పండించ‌డంతో వ్య‌వ‌సాయంలోనూ దూసుకుపోతుంద‌ని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: