టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు సుప్రీంలో ఊరట లభించింది. గొట్టిపాటి రవికుమార్ గ్రానైట్ కంపెనీ మూసివేతకు ఏపి ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుపై స్టే విధించింది సిజెఐ ఎన్వీ రమణ ధర్మాసనం. గొట్టిపాటి గ్రానైట్ కంపెనీలో అవకతవకలు జరిగాయంటూ విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇచ్చింది. రూ.50 కోట్లు జరిమానాకు సిఫారసు చేయగా ఏపీ ప్రభుత్వ షోకాజ్ నోటీసును హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కొట్టేసింది.

సింగిల్ జడ్జి బెంచ్ ఉత్తర్వులను పక్కన పెట్టింది హైకోర్టు డివిజన్ బెంచ్. డివిజన్ బెంచ్ ఆదేశాలను సుప్రీంలో సవాలు చేసారు ఎమ్మెల్యే గొట్టిపాటి. గ్రానెట్ కంపెనీలలో అవకతవకలపై విజిలెన్స్ సిఫారసులు చట్ట విరుద్దమని ఎమ్మెల్యే గొట్టిపాటి తరపున న్యాయవాదులు వాదనలను వినిపించారు. ఏపి ప్రభుత్వ షోకాజ్ నోటీసుపై స్టే విధించింది సుప్రీం ధర్మాసనం. దీనిపై గొట్టిపాటి రవి కుమార్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap