తెలంగాణాలో మావోయిస్ట్ లను అన్ని విధాలుగా కంట్రోల్ చేస్తున్నారు పోలీసు బలగాలు. ఎక్కడా కూడా వారికి అవకాశం ఇవ్వకుండా చర్యలు చేపడుతున్నారు. అగ్ర నేతలు పార్టీ ని వదలడం, మరణాలు కూడా వారిని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా ములుగు జిల్లాలో కాల్పులు జరగగా ఇద్దరు మావోలు ప్రాణాలు కోల్పోయారు. ఎన్ కౌంటర్ పై లేఖ విడుదల చేసారు మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్.

ములుగు జిల్లాలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్ కు నిరసనగా ఈనెల 27న బందుకు పిలుపునిచ్చింది రాష్ట్ర మావోయిస్ట్ పార్టీ. పేద గిరిజన కుటుంబం నుండి ప్రజా ఉద్యమం కోసం అడవి బాటపట్టిన పోరాట వీరులకు నివాలులు అర్పించాం అని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు దుశ్చర్యలకు ప్రతీకారం తీర్చుకునే సమయం దగ్గరలో ఉందని హెచ్చరిస్తున్నాం అన్న ఆయన బూటకపు ఎన్ కౌంటర్ లను రాష్ట్ర మావోయిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తొంది అని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts