లైంగిక వేధింపుల ఘటనలపై 'మహిళా కమిషన్' వెంటనే స్పందిస్తుంది అని మహిళా కమీషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా వరుస ఘటనలపై పోలీసు అధికారులతో మాట్లాడిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ... ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్లలో వివాహితపై వాలంటీర్ దాష్టికంపై సీరియస్‌ అయ్యారు.

 కేసు పూర్వాపరాలు విచారించి...వాలంటీర్ పై యాక్షన్ తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు ఆమె. గుంటూరు రాజీవ్‌గాంధీ నగర్ లో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ ఆరా తీసింది. సత్తెనపల్లి ఉర్దూ పాఠశాల టీచర్, చిత్తూరు జిల్లా పీలేరు మహాత్మా జ్యోతిరావుపూలే బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అరాచకపర్వంపై చర్యలకు వాసిరెడ్డి పద్మ ఆదేశాలు ఇచ్చారు. ఏలూరు సబ్ రిజిస్టార్ లైంగిక వేధింపులు పై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజిస్ట్రేషన్ డిఐజీతో మాట్లాడిన కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ... తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: